శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (14:59 IST)

బావమరిది పాడె మోసిన నారా చంద్రబాబు.. ప్రచార రథంతో యాత్ర

నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ పాడెను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, హరికృష్ణ బావమరిది అయిన నారా చంద్రబాబు నాయుడు మోసారు.

నల్గొండ జిల్లాలో జరిగిన ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ నేత, సినీ నటుడు నందమూరి హరికృష్ణ పాడెను ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత, హరికృష్ణ బావమరిది అయిన నారా చంద్రబాబు నాయుడు మోసారు. గురువారం 2 గంటల సమయంలో మెహిదీపట్నంలోని స్వగృహం నుంచి హరికృష్ణ పార్థివదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా తన బావమరిది హరికృష్ణ పాడె పట్టుకున్నారు.
 
ఒకవైపు చంద్రబాబు, మరోవైపు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పాడెను మోశారు. పాడెకు ముందు ఎన్టీఆర్ కుమారులు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు విషణ్ణవదనంతో ముందునడిచారు. ఈ అంతిమ యాత్రకు నందమూరి అభిమానులేకాకుండా స్థానికులు కూడా భారీ ఎత్తున తరలివచ్చి.. హరికృష్ణ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. 
 
ఆ తర్వాత హరికృష్ణ భౌతికకాయాన్ని వైకుంఠ రథం (ప్రచార రథం) ఎక్కించారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర అంతిమయాత్ర సాగి మహాప్రస్థానం చేరుకోగానే ప్రభుత్వ లాంఛనాలతో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.