గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (15:04 IST)

మహేష్ బాబుకు షాక్.. షోకాజ్ నోటీసులు జారీ.. ఎందుకో తెలుసా?

టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా పేరు తెచ్చుకున్న హీరో మహేష్ బాబు గత ఏడాది వ్యాపార రంగంలో కూడా అడుగుపెట్టారు. గత ఏడాది డిసెంబర్ గచ్చిబౌలిలో మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ పేరుతో మల్టిఫ్లెక్స్‌ను ప్రారంభించారు. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా లాంచ్ అయిన ఈ థియేటర్‌లు చాలా తక్కువకాలంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్నాయి. అందులో అత్యాధునిక సౌకర్యాలు ఉండటంతో పాటుగా టాలీవుడ్ సెలబ్రిటీల వరుస సందర్శనల మరియు ప్రశంసలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఇది చిక్కులలో పడింది.
 
అయితే ఇందులో సినిమా చూడాలంటే జేబు నిండా బాగా డబ్బుండాల్సిందే. ఇటీవల జిఎస్‌టీ అధికారులు ఎఎమ్‌బి మల్టీప్లెక్స్‌ను సందర్శించి నిబంధనలను అతిక్రమిస్తున్నట్లు గుర్తించి, షోకాజ్ నోటసులను జారీ చేసారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సినిమా టికెట్‌లపై 28 శాతంగా ఉన్న జిఎస్‌టీని 18 శాతానికి తగ్గించారు. ఈ నిబంధన జనవరి 1 నుండి అమలులోకి వచ్చింది. అయినప్పటికీ ఏఎమ్‌బి మల్టీప్లెక్స్ మాత్రం 28 శాతం జీఎస్‌టీ ప్రకారం అధిక ధరలకు టిక్కెట్‌లను విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న  జీఎస్టీ అధికారులు తనిఖీ చేసి, షోకాజ్ నోటీసులు జారీ చేశారు.