1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rangasthalam underperforms on TV

బుల్లితెరపై ''రంగస్థలం'' రికార్డ్..

Rangasthalam
''రంగస్థలం'' సినిమా వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా సత్తా చాటుకుంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా బుల్లితెరపై 19.5 టీఆర్పీ రేటింగ్‌ను తెచ్చుకుంది. చరణ్ సినిమాల్లో బుల్లితెరపై ఈ స్థాయి రేటింగ్ సాధించిన సినిమా రంగస్థలం అని సినీ పండితులు చెప్తున్నారు. 
 
ఈ సినిమా విడుదలకు తర్వాత రూ.200 కోట్లకి పైగా గ్రాస్‌ను .. రూ.120 కోట్లకి పైగా షేర్‌ను వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా క్రితం వారం బుల్లితెరపై ప్రసారమైంది. ఈ సందర్భంగా టీఆర్పీ రేటింగ్‌లో ఈ సినిమా అదరగొట్టింది. ఇక జగపతిబాబు, అనసూయ, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. 
తర్వాతి కథనం
24 కిస్సెస్ మూవీ ట్రైలర్ : అందాలను ఆరబోసిన హెబ్బా పటేల్