గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 4 సెప్టెంబరు 2024 (12:55 IST)

రెబల్ స్టార్ వరద సాయం కోసం 2 కోట్లు విరాళం ఇచ్చారు

Prabhas ph
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వరదల రీత్యా ప్రజలకు అల్లకల్లోలం అయ్యారు. ప్రభుత్వాలు, కొందరు పెద్దలు తగినంద సాయం చేస్తూ తోడుగా వున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఎన్. టి.. ఆర్. తోపాటు పలువురు సాయం చేశారు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ తన సాయంగా రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 
 
బాధితుల కోసం కొనసాగుతున్న వరద సహాయక చర్యలకు మద్దతు ఇవ్వడానికి మరియు సహాయం చేయడానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో1 కోటి రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభాస్ కుటుంబీకులు వారి ఊరిలోకానీ మరెక్కడైనా కానీ ఇలాంటి ఉప్రదవాలు వస్తే తగు విధంగా స్పందిస్తుంటారు. ఇందులో క్రిష్టంరాజు ముందు వుండేవారు. 
 
కాగా, ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు మారుతీ నేత్రుత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ షూటింగ్ లో బిజీగా వున్నారు. ఆ తర్వాత కల్కి సెక్వెల్ తోపాటు రెండు సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు.