శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 27 మార్చి 2019 (15:24 IST)

మిస్టర్ రాధారవి.. పాప్‌కార్న్‌ తింటూ ఎంజాయ్ చేయండి.. సమంత(Video)

సహ నటి నయనతారను కించపరిచేలా వ్యాఖ్యానించి తమిళ సీనియర్ నటుడు రాధారవిపై అక్కినేని ఇంటి కోడలు, హీరోయిన్ సమంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా, ఆమె ఓ కఠిన నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇకపై రాధారవి నటించే చిత్రాల్లో నటించబోనని తెగేసి చెప్పారు. 
 
తాజాగా నయనతార నటించిన చిత్రం "కొలైయుదిర్ కాలం". ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు చెన్నైలో జరిగాయి. ఈ వేడుకలకు రాధారవి హాజరయ్యారు. అపుడు కించపరిచేలా వ్యాఖ్యానించారు. రాధారవి ఈ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెను దుమారాన్ని రేపాయి. నయనతార ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌, వరలక్ష్మి, రాధిక, గాయని చిన్మయి తదితరులు బహిరంగంగానే రాధారవి తీరుని ఖండించారు. 
 
అలాగే, సోషల్‌ మీడియాలోనూ ఆయనపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రాధారవికి నడిగర్‌ సంఘం నోటీసులు పంపింది. ఇక నుంచి ఆయనను సినిమాల్లోకి తీసుకోబోమని ఓ నిర్మాణ సంస్థ ప్రకటించింది. నయన్‌ కూడా తన అభిప్రాయాన్ని వెల్లిడిస్తూ ఆయనకు గుణపాఠం చెప్పేసింది.
 
తాజాగా, టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా కఠిన నిర్ణయం తీసుకుంది. "మిస్టర్ రాధారవి.. కష్టం ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది. మీ బాధ చూసి మేము తట్టుకోలేకపోతున్నాం. మీకు ప్రశాంతత లభించాలని కోరుకుంటున్నాం. నయనతార తర్వాతి సూపర్‌హిట్‌ సినిమా టికెట్లు మీకు కొనిస్తాం. పాప్‌కార్న్‌ తింటూ ఎంజాయ్ చేయండి" అని పేర్కొంటూ ట్వీట్ చేసింది. వీడియో చూడండి.