మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (14:06 IST)

హోం క్వారంటైన్‌లో ఏకాంతంగా ''జెర్సీ" హీరోయిన్

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే 50 వేలకు పైగా రోగులు చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా పది లక్షల మంది వరకు ఈ వైరస్ బారినపడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అనేక సెలెబ్రిటీలు కూడా ఈ వైరస్ బారినపడి చనిపోయారు. మరికొందరు సెలెబ్రిటీలు ముందుగానే జాగ్రత్తపడి స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. అలా హోం క్వారంటైన్‌లో ఉన్నవారిలో శ్రద్ధా శ్రీనాథ్ ఒకరు. ఈమె తెలుగు హీరో నాని నటించిన "జెర్సీ" చిత్రంతో మంచి ఫేమస్ అయ్యారు. 
 
బెంగళూరుకు చెందిన శ్రద్ధా తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటిస్తుండడంతో అధికంగా విమాన ప్రయాణాలు చేసేది. దీంతో కరోనా నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా 14 రోజులు హోం క్వారంటైన్‌లో ఉండాలని కర్ణాటక ఆరోగ్యశాఖ ఆదేశించిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తను శ్రద్ధా ఖండించింది.
 
మార్చి 12 -15 తేదీల మధ్య కాలంలో హైదరాబాద్‌ నుంచి చెన్నై విమాన ప్రయాణం చేశానని, ఆ విమానంలో ఎవరికీ కరోనా సోకలేదని, అయినా తన ఫ్యామిలీ డాక్టర్‌ సూచన మేరకు తనకు తానుగా 14 రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉన్నానని ట్విట్టర్‌ ద్వారా స్పష్టం చేసింది.  మార్చి 29 నాటికి క్వారంటైన్‌ 14 రోజులు పూర్తయిందని, ప్రస్తుతం కిచెన్‌లో అమ్మకి సాయం చేస్తున్నానని కూడా శ్రద్ధా ట్వీట్‌ చేసింది.