మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 17 ఆగస్టు 2020 (20:37 IST)

శ్రీరెడ్డి Chennaiలో వున్నందుకే అలా ప్రచారం జరుగుతోందట

ఆమధ్య క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన శ్రీ రెడ్డి మరోసారి దగ్గుబాటి అభిరామ్‌ను టార్గెట్ చేసింది. ‘మీ పెళ్లి ఓకే మరి మీ తమ్మడు అభిరామ్‌తో నా పెళ్లి ఎప్పుడు’ అంటూ రానాపై కామెంట్ చేసింది. మీ తమ్ముడు అభిరామ్‌ను నేను పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా మరో అమ్మాయి జీవితం నాశనం చేయకుండా చూడమంటూ శ్రీరెడ్డి చెప్పింది. ఈ వ్యాఖ్యలతో పాటు మరో వివరణ కూడా ఇచ్చింది.
 
తను హైదరాబాద్ వదిలేసి చెన్నైలో వుండటానికి కారణం గురించి వివరించింది శ్రీరెడ్డి. ఐతే చాలామంది ఈ విషయంపై తప్పుడు వార్తలు వ్యాపింపచేస్తున్నారంటోంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి తను ఇక నోరెత్తకుండా వుండేందుకు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రూ. 6 కోట్లు తీసుకుని హైదరాబాద్ వదిలి చెన్నై వచ్చేసినట్టు కొందరు రూమర్స్ క్రియేట్ చేశారని ఆరోపిస్తోంది. అసలు వారి నుంచి తను సింగిల్ రూపాయి కూడా తీసుకోలేదంటూ వెల్లడించింది. 
 
నేను చెప్పిన మాటలను పట్టించుకోకుండా ఏవేవో కామెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒక్కటే. ప్రతి వీధికి 2 కుక్కలు వుంటాయి. నాపై ఆరోపణలు చేసేవారు అటువంటివారే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రానా పెళ్లి తర్వాత శ్రీరెడ్డి మరోసారి ఇలా సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.