1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Swetha Basu Prasad comments about tollywood hero

చీకటి మనుషులు.. శ్వేత బసు ప్రసాద్.. ఎవరిని చెప్పింది?

Swetha basu prasad
కొత్త బంగారు లోకం హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ ఓ వివాదాస్పద కేసులో పోలీసులకు చిక్కింది. ఎలాగోలా తప్పించుకుని బయటికి వచ్చింది కానీ, కెరీర్ మొత్తం నాశనమైపోయింది. తెలుగు తెరకు పూర్తిగా దూరమైపోయింది.  కానీ అంత జరిగినా ఓ తెలుగు హీరో తనకు ఛాన్సిస్తానంటూ ముందుకొచ్చాడట. ఈ విషయాన్ని శ్వేతబసు ప్రసాద్ తెలిపింది. కానీ ఆశపెట్టి మోసం చేశాడంటూ శ్వేత వాపోయింది. 
 
చేత కానప్పుడు, పబ్లిసిటీ కోసం సొల్లు కబుర్లెందుకు చెప్పాలంటూ ఆ హీరోకి గట్టిగానే క్లాస్ తీసుకుందని శ్వేత వెల్లడించింది. అతనిని "చీకటి మనుషులు" అని శ్వేతా ప్రస్తావించింది బహుశా ఆ హీరోని ఉద్దేశించే కావొచ్చు. ఇకపోతే, తెలుగులో శ్వేతాబసు ప్రసాద్‌కి ఛాన్సులు రాకపోయినా, బాలీవుడ్‌లో బాగానే సందడి చేస్తోంది. 
తర్వాతి కథనం
వైట్ సాస్ పాస్తాతో ఆమె ఇంటికి వెళ్లి.. బెడ్ షేర్ చేసుకున్నా!