1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 30 అక్టోబరు 2021 (18:17 IST)

రేపే RGV'S 'ఆశ ఎన్కౌంటర్', కోర్టుకెళ్లి మరీ విడుదల చేస్తున్నారు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసును ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ మూవీగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రేపు విడుదల కాబోతోంది. ఈ చిత్రం వివాదాస్పదం కావడంతో పేరును ఆశ ఎన్ కౌంటర్‌గా మార్చి విడుదల చేస్తున్నారు.

 
కాగా దిశ కేసులో నలుగురు నిందితులు హైదరాబాద్ నగర పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఈ ఘటన ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమా 'ఆశ.. ఎన్‌కౌంటర్‌'‌. 

 
దిశను నలుగురు యువకులు ఎత్తుకెళ్లడం, అత్యాచారం చేయడం, ఆపై లారీలో తీసుకెళ్లి, ఓ వంతెన కింద పెట్రోల్ పోసి తగులబెట్టడం వంటి ఘటనలకు సంబంధించిన అంశాలు ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ఆపై విచారణ నిమిత్తం పోలీసులు రావడం వరకు వర్మ ట్రైలర్‌లో చూపించారు. 

 
ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ పశువైద్యురాలిని నలుగురు కామాంధులు దారుణంగా అత్యాచారం జరిపి, హత్య చేసిన విషయం తెల్సిందే. ఇది దేశంలో పెను సంచలనమైంది. ఈ ఘటన తర్వాత అత్యాచారాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు దిశ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో కఠిన చట్టాలు వచ్చాయి. ముఖ్యంగా, ఏపీలో దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు కూడా ప్రారంభించడం జరిగింది.