1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 13 నవంబరు 2018 (10:33 IST)

వరలక్ష్మిని అలా అనుకుంటున్నారా?

వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ పాత్రకు బాగా యాప్ట్ అయ్యేలా వుందని దర్శకనిర్మాతలు భావిస్తున్నారేమో కానీ ఆమెను వైవిధ్య పాత్రల కోసం ఎంచుకుంటున్నారు. సర్కార్ తర్వాత మారి-2లో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్.. విలన్ పాత్రలో మెప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా తెరపైకి రానుంది. 
 
అలాగే రాజపార్వే, నీయా-2 చిత్రాల్లోనూ ఆమెకు విలన్ పాత్రలే సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. దీంతో వరలక్ష్మికి ఇప్పుడు కేవలం ప్రతినాయిక పాత్రలు మాత్రమే వస్తున్నాయని కోలీవుడ్‌ వర్గాల్లో టాక్ వస్తోంది. 
 
హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన వరలక్ష్మి శరత్ కుమార్.. విక్రమ్ వేదలో గ్యాంగ్‌స్టర్‌గా నటించింది. ఆపై వచ్చిన అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకుంటున్న వరలక్ష్మి.. పందెంకోడి-2లో కూడా ప్రతినాయికగా నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.