శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 20 మే 2023 (19:31 IST)

మేము ఒకే మాటతో సినిమాలు తీస్తాం : అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్

Anurag Reddy, Sarath, Chandru Manoharan
Anurag Reddy, Sarath, Chandru Manoharan
రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్ మరియు చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ మేమ్ ఫేమస్! దీనికి దర్శకత్వం వహించడంతో పాటు సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర ప్రముఖ తారాగణం సుమంత్ ప్రభాస్ స్వయంగా రచన మరియు దర్శకత్వం వహించారు. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 26ల విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ ఇంటర్వ్యూలో పలువిషయాలు చెప్పారు. 
 
- తెలుగు రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్‌, ఓవర్సీస్‌లో సరిగమ సినిమాస్‌ విడుదల చేస్తున్నాయి. వైజాగ్‌లో అన్నపూర్ణ స్టూడియోస్‌ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తోంది. "గీతా ఆర్ట్స్‌తో పాటు మరికొందరు డిస్ట్రిబ్యూటర్‌లకు మేము ఇటీవల ఈ చిత్రాన్ని ప్రదర్శించాము. వారు కంటెంట్‌తో పూర్తిగా సంతోషంగా కంప్లిమెంట్ చేశారు. సెన్సార్ వారు అభినందనలు తెలిపారు. 
 
- మేము (చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ మరియు లహరి ఫిల్మ్స్) మూడు ప్రాజెక్ట్‌లలో సినిమాలు చేయాలనీ నిర్ణయించుకున్నాము. 'రైటర్ పద్మభూషణ్' మా మొదటి జర్నీ.. 'మేమ్ ఫేమస్' మా ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన రెండో సినిమా. కోవిద్ మహమ్మారి సమయంలో మేము కలిసి టీం గా ఉన్నాము. మామధ్య ఎటువంటి తేడాలు లేవు. మేము పరస్పరం ఒకరినొకరు విశ్వసిస్తున్నాము. అదే మమ్మల్ని  ముందుకు నడిపిస్తుంది. మా నుంచి  మూడో ప్రాజెక్ట్ ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతోంది.
 
- A+S మూవీస్‌లో, చాయ్ బిస్కెట్ కలిపి ఇప్పటికే అడివి శేష్ తో  'మేజర్'ని నిర్మించాము.. ఆ బ్యానర్‌పై భారీ ఎత్తున సినిమాలు రాబోతున్నాయి. ఒకట్రెండు నెలల్లో, A+S మూవీస్ ఆధ్వర్యంలో ఒక పెద్ద స్టార్ సినిమాని ప్రకటిస్తాం.
 
- చాయ్ బిస్కెట్ ఫిలింస్ పై ఎక్కువగా కొత్తవారితో సినిమాలు నిర్మిస్తాం. యూత్, ఫ్యామిలీలు  చూసేలా సినిమాలు తీసుకురావడమే మా లక్ష్యం. ఆ విధంగా, సమర్థులైన కొత్తవారు మా బ్యానర్‌ను తమను తాము ప్రారంభించుకోవడానికి తగిన వేదికగా మా బ్యానేర్ ఉంటుంది. కొత్త వారితోనే కొత్త ప్రయత్నాలు చేయాలని మేము నమ్ముతున్నాము. ఎందుకంటే మేము మొదట్లో అలానే వచ్చాము.   కొత్తవారితో పని చేసినప్పుడు, వైబ్ పూర్తిగా కొత్తగా ఉంటుంది.
 
- యూట్యూబ్‌లో సుమంత్ ప్రభాస్‌ని షార్ట్ ఫిలిమ్స్ చూసిన తర్వాత అతనిని ఎంపిక చేశాము. అతనిలో స్పార్క్ కనిపించింది. తాను రాసిన కథ  ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించాల్సింది వచ్చింది. మొదట్లో సుమంత్ పై విముఖంగా ఉన్నా, కథ చెప్పిన విధానం తీరు అతనిపై నమ్మకం పెరిగి మేము ముందుకు వెళ్లాం.
 
-'మేమ్ ఫేమస్' చాలావరకు కొత్త ప్రతిభావంతులతో తీసాము. మొత్తంగా చూస్తే దాదాపు 45-50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను పరిచయం చేసాము.  ఇది సరైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అని చెప్పగలం. ఎందుకంటే . 23 ఏళ్ల యువకుడు 23 ఏళ్ల యువకుడిలా నటిస్తున్నాడు. అందుకే నటీనటుల ఎంపిక ప్రక్రియకు సమయం పట్టింది.
 
- కథ కంటే చెప్పే విధానం ముఖ్యం. స్క్రీన్ ప్లే బలంగా ఉంటుంది. కథగా చెప్పాలంటే పెళ్లి చూపులు, జాతి రత్నాలు కలిస్తే మేమ్ ఫేమస్' అవుతుంది. యూత్ కోసం సినిమా తీసిన ఫ్యామిలీలు చూసేలా  'మేమ్ ఫేమస్' ఉంటుంది. రచయిత-దర్శకుడు సుమంత్ ప్రభాస్ ఎలాంటి అనుభవం లేకుండా వచ్చినా చాల క్లారిటీ తో తీసాడు. 
 
- ఇది ముగ్గురు యువకుల కథ   వారి ప్రయాణం ఎలా ఉంటుందో ఈ సినిమా తెలుపుతుంది. 'పెళ్లి చూపులు,  'జాతి రత్నాలు' కలగలిసినదిగా 'మేమ్ ఫేమస్'  అని చెప్పినా  ఆ రెండు సినిమాలకు ఈ కథకు సంబంధం లేదు.
 
- ఈ సినిమా చూసినప్పుడు యువకులు చాలా వాటికి రిలేట్ అవుతారు. పెద్దలు సినిమా చూస్తే తమ పిల్లలు ఎలా ఆలోచిస్తారు, ఎందుకు ఆలోచిస్తున్నారు  అనే విషయాలపై వారికి అవగాహనా వస్తుంది. 
 
- కళ్యాణ్ నాయక్ సంగీతం,  BGM అద్భుతంగా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ 'రోజా' సినిమాతో లహరి మ్యూజిక్‌లోకి అడుగుపెట్టింది. అలాంటిది ఈరోజు లహరి ఫిలిమ్స్ సంస్థ 'మేమ్ ఫేమస్' చిత్రాన్ని నిర్మించింది. 
 
- 'మేమ్ ఫేమస్' ప్రమోషన్స్ ప్రత్యేకంగా ఉన్నాయి. విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, అడివి శేష్, హరీష్ శంకర్  ఉన్న ఆ వీడియోలు చాలా మంది ప్రేక్షకులకు చేరువయ్యాయి.  ఈ సినిమా ట్రెండ్ గా నిలుస్తున్నది నమ్మకం ఉంది.