1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. All set for Presidential Election polling

భారత రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌కు సర్వంసిద్ధం

president poll
భారత 15వ రాష్ట్రపతి ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. పార్లమెంట్‌తో సహా పలు రాష్ట్రాల శాసనసభలో పోలింగ్ జరగనున్నప్పటికీ ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 8 గంటలకు మాక్ ఎలక్షన్, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ నిర్వహిస్తారు.
 
ఈ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి తరపున ద్రౌపది ముర్ము, ప్రతిపక్ష నేత యశ్వంత్ సిన్హాలు దేశ ప్రథమ పౌరుడిగా పోటీ పడుతున్నారు. అయితే ఈసారి మాత్రం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 
 
కాగా, ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన 119 మంది ఎమ్మెల్యేలతోపాటు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
అయితే, ఈ ఎన్నికల్లో ప్రజా ప్రతినిధులు ప్రాధాన్యతా పద్ధతిలో ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రాధాన్యతకు అనుగుణంగా వారి పేర్ల ఎదుట 1 అంకె వేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఇచ్చిన పెన్‌ను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. 
 
వేరే పెన్ ఉపయోగిస్తే లెక్కింపు సమయంలో ఆ ఓటును పరిగణనలోకి తీసుకోరు. ఎలక్టోరల్‌ కాలేజ్‌ సభ్యులను మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతి ఇవ్వనున్నారు. అసెంబ్లీ ప్రాంగణమంతా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ చీఫ్‌విప్‌, ప్రభుత్వ విప్‌లు సహ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తెలంగాణాలో నేటి నుంచి ఎంసెట్ - నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ