శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (11:41 IST)

ఆ ఇంటిని ఆలయంగా మార్చాలి .. స్థానికుల డిమాండ్

ఢిల్లీలో సంచలనం సృష్టించిన 11 మంది సామూహిక అత్మహత్యల వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు మెల్లగా ఛేదిస్తున్నారు. మరోవైపు, ఈ ఇంటిని ఆలయంగా మార్చాలని స్థానికుల వైపు నుంచి డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి.

ఢిల్లీలో సంచలనం సృష్టించిన 11 మంది సామూహిక అత్మహత్యల వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు మెల్లగా ఛేదిస్తున్నారు. మరోవైపు, ఈ ఇంటిని ఆలయంగా మార్చాలని స్థానికుల వైపు నుంచి డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి.
 
నిజానికి సంచలనం సృష్టించిన ఢిల్లీలోని బురారీ కుటుంబం మరణోదంతంతో దర్యాప్తు చేసే కొద్దీ విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. నిన్నటికి నిన్న ఓ సీసీటీవీ ఫుటేజ్‌ బయటకొచ్చింది. చనిపోడానికి కొద్ది గంటల ముందు ఆ కుటుంబంలోని కొందరు వ్యక్తులు ఆత్మహత్యల కోసం స్టూలు, వైర్లు తీసుకుని వెళ్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. 
 
ఇదంతా కాసేపు పక్కనబెడితే.. ఆ 11 మంది ఆత్మహత్య చేసుకున్న ఇంటిని ఏం చేయనున్నారు..? అనేది తాజాగా చాలామందికి ఎదురవుతున్న ప్రశ్న. అయితే ఆ ఇంటిని ఆలయంగా మార్చాలని కొందరు స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట. ఢిల్లీలోని బురారీ ప్రాంతానికి చెందిన నారాయణ్‌ దేవి కుటుంబం గత శనివారం అర్ధరాత్రి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. 
 
ఆదివారం ఈ విషయం వెలుగులోకి రాగా.. అప్పటి నుంచి పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాగా.. కుటుంబంలోని 11 మంది ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికితోడు ఆత్మహత్య వెనుక కారణాలు మీడియాలో ప్రసారం కావడం, పోలీసులు రోజూ ఆ ఇంటి వద్దకు వచ్చి వెళ్తుండటంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. 
 
ప్రస్తుతం నారాయణ్‌ దేవి ఇంటిని పోలీసులు సీజ్‌ చేశారు. మరి దర్యాప్తు తర్వాత ఆ ఇంటిని ఎవరికి అప్పగిస్తారు అన్న దానిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే ఆ ఇంటిని ఆలయంగా మార్చితేనే మంచిదని కొందరు స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 'ఆ ఇంటికి తీసుకోడానికి బంధువులెవరూ ముందు రావట్లేదు. అమ్మినా ఎవరూ కొనుగోలు చేయడానికి సాహసించరు. అందుకే దాన్ని ఆలయంగా మార్చితే బాగుంటుంది' అని స్థానికులు చెబుతున్నారు.