1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. shocking, fake notes found during this election period

తస్మాత్ జాగ్రత్త... జనం పైకి రూ.200 నకిలీ నోట్లు...

shocking
ఎన్నికల వేళ నకిలీ నోట్లు వచ్చేశాయి. ఉత్తరాదిన థానేలో రూ. 200 నకిలీ నోటు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇంటి పన్ను చెల్లించేందుకు ఓ వ్యక్తి గ్రామ పంచాయతీకి వెళ్లగా దానిని పరిశీలించిన అధికారి అది నకిలీ నోటని చెప్పారు. 
 
ఈ నోటుపై గాంధీజీ వాటర్ మార్క్ లేదు. అలాగే పచ్చగా వుండే ఆర్బీఐ నిలువు గీతలు లేవు. అంతేకాకుండా మామూలు 200 నోటు కంటే 2 మి.మిటర్లు తక్కువ సైజులో వుంది. ఈ నోటును చూసినవారంతా ఎన్నికల వేళ నకిలీ నోట్లు రంగంలోకి వచ్చేశాయని చెప్పుకుంటున్నారు. మరి మీ చేతికి వస్తున్న నోట్లను కూడా జాగ్రత్తగా పరిశీలించుకోండి మరి.
తర్వాతి కథనం
తెలంగాణ లోక్‌సభ పోల్స్... 17 సీట్లు - 443 అభ్యర్థులు