Astrology Zodiac Cancer Luc.htm

Notifications

కర్కాటకం కర్కాటకం
ఆదాయం మరియు అదృష్ణం

కర్కాటకరాశికి చెందిన వారు ఆశించిన వృత్తులలో విజయవంతంగా రాణిస్తారు. ముఖ్యంగా సొంత వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. ధనార్జన కోసం దూరతీరాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయినా వీరి దృఢ సంకల్పం కారణంగా ఎక్కడైనా రాణించగలుగుతారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు. అంతేకాదు ఉపాధ్యాయ వృత్తి, వివిధ కంపేనీలలో ఆపరేటర్లుగానూ పనిచేస్తారు.

పురుషులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనిద్దాం: TGRTCలో సందేశం, వీడియో

పురుషులకు కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనిద్దాం: TGRTCలో సందేశం, వీడియోతెలంగాణకు చెందిన ఓ యువతి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో వున్న సందేశం ఏమిటంటే.... పురుషులను గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాము... అని బస్సులో డ్రైవర్ సీటు వెనుక రాసి వున్నది. ఇదివరకూ...స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాము అని వుండేది. దాని స్థానంలో ఇలా వుండటం ఒకింత ఆశ్చర్యం కలుగవచ్చు. కానీ స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన దగ్గర్నుంచి పురుషుల సీట్లను కూడా స్త్రీలు ఆక్రమించేస్తున్నారు. దీనితో తెలంగాణ ఆర్టీసి ఇలా రాయాల్సి వచ్చిందని అంటున్నారు.

ఏపీలో వైకాపా నేతల పాపం పండుతోంది... కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్టు

ఏపీలో వైకాపా నేతల పాపం పండుతోంది... కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్టుగత వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకు, బెదిరింపులు, కిడ్నాప్‌లు, భూకబ్జాలు, అవినీతికి పాల్పడ్డారు. తాజాగా కిడ్నాప్‌ కేసులో గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే, వైకాపా నాయకుడు షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా నూజివీడు పోలీసులు అరెస్టు చేశారు. వ్యాపార వివాదాల నేపథ్యంలో పొగాకు వ్యాపారి కుమారుడితో పాటు మరో ముగ్గురిని కిడ్నాప్‌ చేసి బెదిరింపులకు పాల్పడిన ఘటనలో మాజీ ఎమ్మెల్యే షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా, ఆయన కుమారుడు బషీర్‌లపై నూజివీడు పోలీసులు కిడ్నాప్‌, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

04-08-2026 మంగళవారం ఫలితాలు.. మీ కష్టం వృధాకాదు.. శుభవార్త వింటారు..

02-08-2026 ఫలితాలు - మీ శ్రీమతి సహాయం ఉత్సాహాన్నిస్తుంది..

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?

ఆదివారం పూట రావిచెట్టు కింద వినాయకుడిని పూజిస్తే.. ఆ ఐదు వృక్షాలు..?ఆదివారం పూట రావిచెట్టు కింద వున్న విఘ్నేశ్వరుడిని పూజించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. విఘ్నేశ్వరుడిని ఓ చిన్నపాటి గరికెను సమర్పించి ప్రార్థిస్తేనే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అలా పంచభూత వృక్షాల కింద కొలువై వున్న వినాయకుడిని పూజిస్తే సర్వదా శుభం కలుగుతుంది. ఆ వృక్షాలేంటో చూద్దాం. కొన్ని వృక్షాలను పంచభూత శక్తులను కలిగివుంటాయి. అవేంటంటే.. రావిచెట్టు - ఆకాశాన్ని సూచిస్తుంది. వాతనారాయణ వృక్షం - వాయువు అంటే గాలిని సూచిస్తుంది. వన్ని వృక్షం అంటే అగ్నిని సూచిస్తుంది. ఉసిరి చెట్టు- నీటిని జలాన్ని సూచిస్తుంది. అలాగే మర్రి చెట్టు భూమికి సంకేతంగా నిలుస్తుంది.

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?

02-08-2026 నుంచి 08-08-2026 వరకు ఫలితాలు, ఈ వారం ఎలా వుండబోతోంది?మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ధనసహాయం, ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. ప్రముఖలతో పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగాలి. శనివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు అస్తవ్యస్తంగా సాగుతాయి. దంపతుల మధ్య సఖ్యత లోపం. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. సంతానానికి శుభపరిణామాలున్నాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు, వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వేడుకకు హాజరవుతారు. బంధుమిత్రులు ఆతిధ్యం ఆకట్టుకుంటుంది.