ఆంధ్రప్రదేశ్‌లో రెట్టింపవుతున్న కరోనా పాజిటివ్ కేసులు

బుధవారం, 5 జనవరి 2022 (18:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రెట్టింపవుతున్నాయి. మంగళవారంతో పోల్చితే బుధవారం ఈ కేసుల సంఖ్య డబుల్ అయింది. అంటే గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన కోవిడ్ పరీక్షల్లో 434 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. ఇందులో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 68 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో అత్యల్పంగా ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే గత 24 గంటల్లో ఒక్క కరోనా రోగి కూడా ప్రాణాలు కోల్పోలేదు. 
 
ఇదిలావుంటే, 24 గంటల్లో 102 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. తాజాగా కేసులతో కలుపుకుంటే రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసుల సంఖ్య 20,75,481కు చేరింది. వీరిలో 20,59,134 మంది కోలుకోగా, 14,499 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1848 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

Sanjay Rao: హిట్ అండ్ రన్ ఫస్ట్ లుక్ తో సంజయ్ రావ్ క్రేజ్

మహేష్ బాబు అతిథి 4K థియేటర్లలో పాలాబిషేకంతో అభిమానుల సందడి

Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా చిత్రానికి రోమాంచకం టైటిల్ ఖరారు

తర్వాతి కథనం
Show comments