Fast Food

Notifications

  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. ఫాస్ట్ ఫుడ్



ప్రపంచ పర్యావరణ దినోత్సవం- 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీని ప్రారంభించిన పవన్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం- 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారీని ప్రారంభించిన పవన్ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడం, పర్యావరణ పునరుద్ధరణను ప్రోత్సహించే ప్రభుత్వ ప్రయత్నాలలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ శుక్రవారం నాడు 2.5 కోట్ల విత్తన బంతుల (సీడ్ బాల్స్) తయారీ, పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, "మేము ఒకే ప్రాంతంలో 1,000 తెల్లపొనికి మొక్కలను నాటాము. ఈ చెక్కను కొండపల్లి బొమ్మల తయారీలో ఉపయోగిస్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, రాష్ట్రంలో అటవీ విస్తరణ, వాతావరణ మార్పులను తట్టుకునే సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నాలలో భాగంగా, 2.5 కోట్ల విత్తన బంతులను తయారు చేసి పంపిణీ చేయడం ద్వారా పర్యావరణ పునరుద్ధరణను ప్రోత్సహించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది," అని అన్నారు.

మిర్యాలగూడలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవదహనం

మిర్యాలగూడలో గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు సజీవదహనంతెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ మిర్యాలగూడ పట్టణంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమయ్యారు. పట్టణంలోని కలాల్వాడ ప్రాంతంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. ఈ వివరాలను పరిశీలిస్తే, వనం చంద్రకళ (45), తన మనవడు లక్ష్మణ్ (16), మనవరాలు ప్రణతి (14)తో కలిసి ఓ పెంకుటింటిలో ఉంటున్నారు. గురువారం రాత్రి వీరంతా నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని కాడాపేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో మంటలు క్షణాల్లో ఇల్లంతా వ్యాపించడంతో ఆ ముగ్గురూ బయటకు రాలేక, సజీహదహనమైపోయారు.