తూర్పు కాంగోలో మళ్లీ బయటపడిన ఎబోలా కేసు

శనివారం, 9 అక్టోబరు 2021 (15:22 IST)
తూర్పు కాంగో దేశంలో మళ్లీ ఎబోలా కేసు ఒకటి నమోదైంది. ఆ రాష్ట్ర వైద్య శాఖామంత్రి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఐదు నెలల తర్వాత ఈ కేసు నమోదైంది. ఈ ఎబోలా వైరస్ కారణంగా గత 2018-20 మధ్య కాలంలో తూర్పు కాంగోలో 2,200 మందికి పైగా మరణించారు. ఈ యేడాది ఈ వైరస్ ధాటికి ఇప్పటికే కొందరు చనిపోయారు. 
 
2018-2020 వ్యాప్తికి కేంద్రబిందువులలో ఒకటైన తూర్పు నగరం బెని సమీపంలో 3 ఏళ్ల బాలుడు పాజిటివ్‌గా పరీక్షించబడ్డాడు. ఈ బాలుడు ఈ వ్యాధితో మరణించినట్లు ఆరోగ్య మంత్రి జీన్ జాక్వ్స్ మ్బుంగాని ఒక ప్రకటనలో తెలిపారు.
 
అలాగే, ఎబోలా వైరస్ బారినపడిన మరో వంద మందిని వైద్యశాఖ అధికారులు గుర్తించారు. వీరిలో కనిపించే లక్షణాలపై శాస్త్రవేత్తలు ఆరా తీస్తున్నారు. 
 
కాంగో యొక్క బయోమెడికల్ లాబొరేటరీ నుండి వచ్చిన అంతర్గత నివేదిక ప్రకారం, బెని యొక్క జనసాంద్రత కలిగిన బుట్సిలి పరిసరాల్లోని పసిపిల్లల పొరుగువారిలో ముగ్గురు కూడా గత నెలలో ఎబోలాకు సంబంధించిన లక్షణాలను కనిపిస్తున్నాయి. కానీ ఈ ప్రాంత వాసులు ఎబోలా వైరస్ పెద్దగా అవగాహన లేకపోవడంతో పెద్దగా పట్టించుకోవడం లేదు. 

అన్నీ చూడండి

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments