Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పు కాంగోలో మళ్లీ బయటపడిన ఎబోలా కేసు

Written By ఠాగూర్
Updated: శనివారం, 9 అక్టోబరు 2021 (15:24 IST)
తూర్పు కాంగో దేశంలో మళ్లీ ఎబోలా కేసు ఒకటి నమోదైంది. ఆ రాష్ట్ర వైద్య శాఖామంత్రి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఐదు నెలల తర్వాత ఈ కేసు నమోదైంది. ఈ ఎబోలా వైరస్ కారణంగా గత 2018-20 మధ్య కాలంలో తూర్పు కాంగోలో 2,200 మందికి పైగా మరణించారు. ఈ యేడాది ఈ వైరస్ ధాటికి ఇప్పటికే కొందరు చనిపోయారు. 
 
2018-2020 వ్యాప్తికి కేంద్రబిందువులలో ఒకటైన తూర్పు నగరం బెని సమీపంలో 3 ఏళ్ల బాలుడు పాజిటివ్‌గా పరీక్షించబడ్డాడు. ఈ బాలుడు ఈ వ్యాధితో మరణించినట్లు ఆరోగ్య మంత్రి జీన్ జాక్వ్స్ మ్బుంగాని ఒక ప్రకటనలో తెలిపారు.
 
అలాగే, ఎబోలా వైరస్ బారినపడిన మరో వంద మందిని వైద్యశాఖ అధికారులు గుర్తించారు. వీరిలో కనిపించే లక్షణాలపై శాస్త్రవేత్తలు ఆరా తీస్తున్నారు. 
 
కాంగో యొక్క బయోమెడికల్ లాబొరేటరీ నుండి వచ్చిన అంతర్గత నివేదిక ప్రకారం, బెని యొక్క జనసాంద్రత కలిగిన బుట్సిలి పరిసరాల్లోని పసిపిల్లల పొరుగువారిలో ముగ్గురు కూడా గత నెలలో ఎబోలాకు సంబంధించిన లక్షణాలను కనిపిస్తున్నాయి. కానీ ఈ ప్రాంత వాసులు ఎబోలా వైరస్ పెద్దగా అవగాహన లేకపోవడంతో పెద్దగా పట్టించుకోవడం లేదు. 

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments