బుధవారం, 9 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 8 అక్టోబరు 2024 (10:10 IST)

పోలవరం ప్రాజెక్టు.. సహకరించినందుకు మోదీకి ధన్యవాదాలు.. బాబు

polavaram
పోలవరం ప్రాజెక్టుకు సహకరించినందుకు ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. 
విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న హామీని ముందుకు తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు అంటూ బాబు అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో జరిగిన సమావేశం ఫలప్రదంగా సాగిందని చంద్రబాబు తెలిపారు.
 
పోలవరం ప్రాజెక్ట్‌కి సంబంధించిన సవరించిన వ్యయ అంచనాలకు కేబినేట్ ఆమోదం తెలిపినందుకు రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చినందుకు ప్రధానికి సోషల్ మీడియా పోస్ట్‌లో ధన్యవాదాలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన వ్యయాలను తెలియజేశానని వెల్లడించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను ఆయనకు వివరించాను. 
 
ఆంధ్రప్రదేశ్ అంతటా వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై రైల్వే రూ.73,743 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు వైష్ణవ్ తనకు తెలియజేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.