Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి దర్శనం?

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 31 మే 2020 (09:15 IST)
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో దశ లాక్డౌన్ మే 31వ తేదీ అర్థరాత్రితో ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ జూన్ 30వ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే, ఈ లాక్డౌన్‌లో అనేక సడలింపులు ఇచ్చింది. అలాగే, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను జూన్ ఎనిమిదో తేదీ నుంచి తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో శ్రీవారి ఆలయం కూడా జూన్ 8 తర్వాత భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని భావిస్తోంది. 
 
ఇందుకోస తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలి ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా, శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు విధిగా ముఖానికి మాస్కులు ధరించడం, సామాజిక భౌతికదూరం పాటించడంవంటి జాగ్రత్తలన్నీ పాటించేలా చర్యలు తీసుకోనుంది. 
 
ఇదే అంశంపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఆలయం ఎపుడు తెరవాలన్న అంశంపై తుది నిర్ణయం తీసుకుని అధికారికంగా ప్రకటిస్తామన్నారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులను అనుమతి ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు. 

అన్నీ చూడండి

ఎంజీఎం హెల్త్‌కేర్‌లో సీఎంఈను ప్రారంభించిన తమిళనాడు అసెంబ్లీ స్పీకర్

మా అమ్మ ఏం పాపం చేసింది.. ఇంతగా అవమానించారు : బోరున విలపించిన కొండా సుస్మిత (Video)

వైఎస్ షర్మిలకు కాబోయే అల్లుడు ఎవరో తెలుసా?

బైబై నాన్నా... నా దగ్గరకు మీరు రాలేరు అంటూ నదిలో దూకేసిన యువతి, వీడియో

లొట్టలేసుకుని కేఎఫ్‌సీ చికెన్ లాగించేస్తున్నారా.... వామ్మో... (Video)

అన్నీ చూడండి

06-09-2026 ఆదివారం దినఫలాలు - ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది

06-09-2026 నుంచి 12-09-2026 వరకు వార ఫలితాలు - ఆశించిన ధనం అందుతుంది

05-09-2026 శనివారం దినఫలాలు - ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టండి...

Janmashtami, మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన చెరసాల చూసారా?, వీడియో

04-09-2026 శుక్రవారం నాటి రాశి ఫలితాలు... ధన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం..

తర్వాతి కథనం
Show comments