టీటీడీకి తలనొప్పి.. రూ.400 కోట్లకు పైగా పాత నోట్లు.. హుండీ ఆదాయంతో ఆర్థిక నష్టం

Written By సెల్వి
Updated: మంగళవారం, 7 ఏప్రియల్ 2026 (13:45 IST)
Old Notes
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీ ఆదాయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే శ్రీవారి హుండీలో ఏళ్ల క్రితం రద్దైన నోట్లు వచ్చిపడుతున్నాయి. ఇది టీటీడీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నోట్లు 2016లో రద్దు అయినప్పటికీ తిరుమల హుండీలో మాత్రం పాత నోట్ల ప్రవాహం ఆగట్లేదు. తాజా సమాచారం ప్రకారం టీటీడీ వద్ద ప్రస్తుతం రూ.400 కోట్లకు పైగా విలువైన పాత రూ.500, రూ.1000 నోట్లు నిల్వ వున్నాయి. 
 
భక్తులు తమ వద్ద ఉండిపోయిన లేదా మరిచిపోయిన ఈ పాత నోట్లను భక్తితో స్వామివారి హుండీలో వేస్తున్నారు. ఈ నోట్లను మార్పిడి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం గానీ, ఆర్బీఐ గానీ ఇప్పటి వరకు అనుమతి నిరాకరించాయి. దీనివల్ల టీటీడీకి వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. 
 
మరోవైపు ఇటీవలే చలామణి నుంచి ఉపసంహరించుకున్న రూ.2వేల నోట్లు కూడా హుండీలో భారీగా చేరుతున్నాయి. అయితే పాత నోట్లతో పోలిస్తే వీటి విషయంలో టీటీడీకి కొంత ఊరట లభిస్తోంది. రూ.2వేల నోట్లను ఆర్బీఐ ద్వారా మార్చుకునే అవకాశం ఇంకా అందుబాటులో ఉండటంతో వీటిని టీటీడీ సకాలంలో బ్యాంకుల్లో జమ చేస్తోంది. 
 
కానీ రూ.500, రూ.1000ల నోట్లు కేవలం కాగితపు రాశిగా మిగిలిపోవడం విచారకరం. భక్తుల మనోభావాలను గౌరవించి, టీటీడీ వద్ద వున్న ఈ భారీ మొత్తాన్ని ప్రత్యేక కేసుగా పరిగణించి మార్పిడి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందుతున్నాయి. 

అన్నీ చూడండి

ఇరాన్ ట్రైలర్ మాత్రమే చూసింది.. ముందుంది అసలు సినిమా : డోనాల్డ్ ట్రంప్

విజయనగరం జిల్లాల్లోకి అడవి ఏనుగుల గుంపు.. భయం భయం

గత పాలకులు చేసిన తప్పులు నిలదీస్తున్నందే ప్రశ్నల వర్షం : సీఎం రేవంత్

కరీంనగర్‌లో భారీ దోపిడీ.. 66 తులాల బంగారం, 10 తులాల వెండి, 21లక్షలు ఎత్తుకెళ్లారు..

ఆస్ట్రేలియా బాండీ బీచ్‌ కాల్పుల ఘటన హీరోకు సిడ్నీలో శాశ్వత నివాసం

అన్నీ చూడండి

32 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ - సింహాచలంలో భారీ ఏర్పాట్లు

22-07-2026 బుధవారం ఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

బోనాల ఉత్సవాల కోసం గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు

తర్వాతి కథనం
Show comments