ఈ నెల 31వ తేదీన వీఐపీ దర్శనాలు రద్దు.. ఎందుకో తెలుసా?

ఠాగూర్
ఆదివారం, 27 అక్టోబరు 2024 (17:50 IST)
ఈ నెల 31వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. దీపావళి ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో దీపావళి రోజున సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను అనుమతించరు. అయితే, ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రం మినహాయింపు ఉంటుంది. అదేసమయంలో ఈ నెల 30వ తేదీన సిఫారసు లేఖలను స్వీకరించబోనని స్పష్టం చేశారు. 
 
విజయవాడ - విశాఖ మధ్య మరో రెండు విమాన సర్వీసులు 
 
విజయవాడ - విశాఖపట్టణం ప్రాంతాల మధ్య కొత్తగా మరో రెండు విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. విశాఖ విమానాశ్రయంలో ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమాన సర్వీసును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌ నాయుడు ప్రారంభించారు. 
 
ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు ఉదయం 9:35 గంటలకు విశాఖలో బయలుదేరి 10:35కు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుతుంది. తిరిగి రాత్రి 7:55కు విజయవాడలో బయలుదేరి 9 గంటలకు విశాఖ చేరుతుంది. 
 
అలాగే, ఇండిగో విమాన సర్వీసు రాత్రి 7:15కు విజయవాడలో బయలుదేరి 8:20కి విశాఖ చేరుతుంది. అదే సర్వీసు తిరిగి రాత్రి 8:45కు విశాఖలో బయలుదేరి 9:50కి విజయవాడ చేరుతుంది. ఈ కొత్త విమానాలతో కలిపి విశాఖ - విజయవాడ మధ్య తిరిగే సర్వీసుల సంఖ్య మూడుకు చేరనుంది. 

అన్నీ చూడండి

తెలిసినవారితో తెలుగు అమ్మాయిలు జాగ్రత్త, 80 శాతం లైంగిక దాడులకు వీళ్లే కారకులు, రిపోర్ట్

Rahul Gandhi: జంతర్ మంతర్ వద్ద రాహుల్ గాంధీ.. ఎత్తుకెళ్లిన పోలీసులు

బ్రిటన్‌లో తొలి ఏఐ మంత్రిగా భారతీయుడు

Mysuru: భార్య, ఇద్దరు కుమార్తెల గొంతు నులిమి చంపేసిన భర్త

దారుణం, రెండ్రోజుల వయసున్న ఆడ శిశువును సంచీలో పెట్టి రోడ్డుపక్కన వదిలేసారు

అన్నీ చూడండి

విద్యా ప్రతిభకు, జ్ఞాపక శక్తికి హయగ్రీవుని మంత్రం

21-07-2026 మంగళవారం ఫలితాలు- తప్పుచేశామన్న భావం రానీయకండి

బోనాల ఉత్సవాల కోసం గోల్కొండ కోటకు పోటెత్తిన భక్తులు

20-07-2026 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

19-07-2026 ఆదివారం ఫలితాలు - వస్తులాభం.. వస్త్రప్రాప్తి ఉన్నాయి....

తర్వాతి కథనం
Show comments