శ్రీవారి భక్తులకు చేదువార్త, వైకుంఠ ఏకాదశికి వైకుంఠ ద్వారాలు అన్ని రోజులు ఉండవట

శుక్రవారం, 29 నవంబరు 2019 (18:49 IST)
శ్రీవారి భక్తులకు చేదు వార్త. వైకుంఠ ఏకాదశి రోజు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలను తెరిచే ఉంచుతామని టిటిడి గతంలో నిర్ణయం తీసుకుంది. అది కూడా శ్రీరంగం ఆలయ తరహాలో ఆలయాన్ని తెరిచే ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో మాత్రమే సాధారణంగా దర్సనం చేసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం ఆగమ శాస్త్రబద్థంగా, ఆగమ సలహాదారుల నిర్ణయాలు తీసుకునే పనిలో పడ్డారు టిటిడి ఉన్నతాధికారులు. ఈ విషయాన్ని స్వయంగా టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి వెల్లడించారు. 
 
ప్రస్తుతానికి ఇదే విషయంపై ఆగమ సలహాదారులతో చర్చలు జరుగుతోంది. స్వామివారికి సంబంధించిన విషయాలేవీ ఆషామాషీ కాదు. ఆచితూచి అడుగులు వేయాలి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. అదే పనిచేస్తున్నాం. ప్రస్తుతానికి అయితే పాత పద్ధతినే కొనసాగించాలన్న నిర్ణయంలో ఉన్నాం. ఆ తరువాత దైవేచ్ఛ అంటూ టిటిడి ఛైర్మన్ తెలిపారు. దీన్నిబట్టి వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారాలు పదిరోజుల పాటు తెరిచే అవకాశం ఏ మాత్రం కనిపించడం లేదు. 

అన్నీ చూడండి

అత్తింటివారు బైకు కొనివ్వలేదని భార్యను గదిలో ఉరేసిన భర్త...

ఆస్తులమ్మి భార్యకు గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించిన భర్త: ప్రియుడితో కలిసి లేచిపోయిన భార్య

కారును ఢీకొట్టి 600 మీటర్ల దూరం ఈడ్చెకెళ్లిన ట్రక్కు.. (వీడియో)

ఉభయ గోదావరి జిల్లాలో హడలెత్తిస్తున్న పెద్దపులి

డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం

అన్నీ చూడండి

30-05-2026 శనివారం ఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి.. ఓర్పుతో పనిచేయండి...

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

తర్వాతి కథనం
Show comments