కేఏ పాల్‌పై దాడి: పాల్‌పై చెంపదెబ్బ..

సోమవారం, 2 మే 2022 (19:44 IST)
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌పై దాడి జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
 
కేఏ పాల్‌ వస్తున్నారనే సమాచారంతో ముందుగా జిల్లా సరిహద్దుకి చేరుకున్నారు టీఆర్‌ఎస్‌ నాయకులు, జిల్లా సరిహద్దులోని సిద్దిపేట జిల్లా జక్కపూర్ గ్రామం వద్ద ఆయన్ని అడ్డుకున్నారు. 
 
డీఎస్పీ పక్కనే ఉండగా.. ఓ వ్యక్తి వచ్చి పాల్‌పై దాడి చేశాడు. పాల్‌ చెంపపై కొట్టాడు. ఇక, వెంటనే అప్రమత్తమైన ఆయన అనుచరులు అతడిని అడ్డుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు.
 
పోలీసుల ఎదుటే టీఆర్ఎస్‌ శ్రేణులు నాపై దాడి చేశారని మండిపడ్డారు కేఏ పాల్.. పోలీసులు మీరు ప్రభుత్వ ఉద్యోగులా? లేక టీఆర్ఎస్‌ కార్యకర్తలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అన్నీ చూడండి

Srinu Vaitla: శర్వా నంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమాకు సన్నాహాలు

మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు కన్నప్ప

Sree Vishnu: ఒరియా పిల్లా.. అంటూ టీజ్ చేస్తున్న కామ్రేడ్ కళ్యాణ్

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం

Vadde Naveen: ప్రస్తుతం ప్రేక్షకులు సినిమాల్ని చూసే తీరు మారింది : వడ్డే నవీన్

తర్వాతి కథనం
Show comments