కస్టమర్లకు నాణ్యతలేని ఆహారం.. సికింద్రాబాద్‌లో ఆల్పా హోటల్ సీజ్

సోమవారం, 18 సెప్టెంబరు 2023 (08:57 IST)
హోటల్‌లో అపరిశుభ్ర వాతావరణం, కస్టరమర్లకు నాణ్యతలేని ఆహారాన్ని సరఫరా చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో సికింద్రాబాద్ నగరంలోని ఆల్పా హోటల్‌ను గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ అధికారులు సీజ్ చేశారు. ఆదివారం ఈ హోటల్‌లో తనిఖీలు చేసిన జీహెచ్ఎంసీ అదికారులు.. ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ నెల 15వ తేదీన ఈ హోటల్‌పై పలువురు ఫిర్యాదు చేసారు. అంతకుముందు కొద్ది రోజులుగా హోటల్‌లోని అపరిశుభ్ర వాతావరణానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అవి వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. ఈ క్రమంలో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు... హోటల్‌లో తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారు. 
 
హోటల్ నిర్వహణలో యాజమాన్యం నిర్లక్ష్యపూరిత ధోరణి గుర్తించారు. దీంతో, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని వారిని హెచ్చరించారు. తదుపరి చర్యలు తీసుకునే వరకూ హోటల్‌ను మూసేశారు. కేసును అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని, ఆపై హోటల్ యాజమాన్యానికి పెనాల్టీ విధిస్తామని వారు తెలిపారు. అలాగే, హోటల్‌లోని ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించి నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబ్‌కు పంపించారు. 

అన్నీ చూడండి

జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి

Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స

అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది

Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ

ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ

తర్వాతి కథనం
Show comments