తెలంగాణలో ఆగని ఇంటర్ విద్యార్థుల ఆందోళన

బుధవారం, 22 డిశెంబరు 2021 (12:25 IST)
తెలంగాణలో ఇంటర్ విద్యార్థుల ఆందోళన ఆగేట్లు లేదు. నేటితో ఇంటర్ రీ-వాల్యువేషన్,  రీకౌంటింగ్ గడువు ముగియనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం ఉచితంగా రీ వాల్యుయేషన్‌ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. కరోనా కాలంలో ఆల్ పాస్ కాకుండా ముప్పావు శాతం మందిని ఫెయిల్ చేయడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. 
 
ఇప్పటికే ఇంటర్మీడియట్‌ బోర్డు వైఖరిని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నేతలు తప్పుబట్టారు. తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు వైఖరిని నిరసిస్తూ ఆ కార్యాలయం ఎదుట తెలంగాణ వైఎస్సార్‌సీపీ, టీజే ఎస్‌లతో పాటు ఏబీవీపీ ధర్నా నిర్వహించారు. ఫెయిలైన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ వారు డిమాండ్‌  చేశారు.
 
ఈ ధర్నాలో ఆందోళన చేపట్టిన వారిని పోలీసులు అరెస్టు చేసి గోషామహాల్‌ స్టేడియానికి తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా రీ వాల్యుయేషన్‌ చేసి విద్యా ర్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

కాగా, ఆరు రోజుల పాటు ఈ ఆందోళన జరుగుతోంది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. కనీస మార్కులతో పాస్ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

అన్నీ చూడండి

నటి దివ్య సురేష్‌కు చేదు అనుభవం.. భద్రత ఎక్కడ ఉన్నాయి? (video)

Samantha: మహిళా సూపర్ స్టార్లు రావాలంటే నిర్మాతలు ముందుకు రావాలి : సమంత రూత్ ప్రభుv

Vishal: శివ చూశాక దర్శకుడిగా మారాలని ఫిక్స్ అయ్యాను : విశాల్

Virat Karna: చలికి శరీరం ఫ్రీజ్ అయింది - నాగసాధు మేకప్ కి ఆరు గంటలు పట్టేది.: విరాట్ కర్ణ

Brahmanandam: హ్యాంగ్‌మెన్ లాంటి ఆలోచన రావడమే గొప్ప విషయం :డా. బ్రహ్మానందం

తర్వాతి కథనం
Show comments