శుక్రవారం, 27 జూన్ 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 26 జూన్ 2025 (15:50 IST)

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Suresh babu, Vijay Anthony and team
Suresh babu, Vijay Anthony and team
విజయ్ ఆంటోని నటిస్తూ, నిర్మించిన ‘మార్గన్’ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బానర్ పై జె.రామాంజనేయులు సగర్వంగా సమర్పిస్తున్నారు. ఈ సినిమాను జూన్ 27న సురేష్ బాబు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.  ఈ సందర్భంగా మార్గన్ ప్రీ రిలీజ్ లైవ్ ఇంటరాగేషన్ అనే ఓ ఈవెంట్‌ను చిత్రయూనిట్ నిర్వహించింది.
 
సురేష్ బాబు మాట్లాడుతూ .. ‘విజయ్ ఆంటోని గారిని నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. మ్యూజిక్ డైరెక్టర్ నుంచి హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన ప్రయాణాన్ని చూస్తూ ఉన్నాను. ఆయనకు సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. నేను అలాంటి వారు తీసే చిత్రాల్ని చూసేందుకు ఇష్టపడుతుంటాను. అందుకే నేను ‘మార్గన్’ మూవీని తీసుకుని తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఆయన ప్రొడక్షన్ కంపెనీ, వాల్యూ, మేకింగ్ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం.’ అని అన్నారు.
 
విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ .. ‘మా సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ బాబు గారికి చాలా ధన్యవాదాలు. ఆయన చాలా గొప్ప నిర్మాత. భవిష్యత్తులో ఆయనతో కలిసి పని చేయాలని అనుకుంటున్నాను. ఆయన మా సినిమాను రిలీజ్ చేస్తుండటమే మా మొదటి సక్సెస్. లియో జాన్ పాల్ ఈ మూవీని అద్భుతంగా తీశారు. ఇదొక నార్మల్ సీరియల్ కిల్లర్ చిత్రంలా ఉండదు. ఇందులో చాలా లేయర్లు ఉంటాయి. నేను కంటెంట్ గురించి ఎక్కువ మాట్లాడితే కథ రివీల్ అవుద్ది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఎంగేజింగ్‌గా ఉంటుంది.

నేను ఈ సినిమాకు సంగీతాన్ని అందించాను. భద్రకాళి, లాయర్ చిత్రాలకు కూడా సంగీతాన్ని అందిస్తున్నాను. నేను ప్రస్తుతం ఆరేడు సినిమాల్ని నిర్మిస్తున్నాను. మా ‘మార్గన్’ ప్రస్తుతం తమిళ, తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. మా సిస్టర్ సన్ అజయ్ ధీషన్ బిచ్చగాడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశారు. అతడ్ని ఈ చిత్రంతో నటుడిగా పరిచయం చేస్తున్నాను. భాష్యశ్రీ గారి పాటలు, మాటల వల్ల ఇది పూర్తి తెలుగు సినిమాగా అనిపిస్తోంది. బ్రిగిడ, దీప్శిఖ గొప్పగా నటించారు. జూన్ 27న రాబోతోన్న మా ‘మార్గన్’ సినిమాను అందరూ చూడండి’ అని అన్నారు.
 
అజయ్ ధీషన్ మాట్లాడుతూ, రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్‌లా ఉండదు. ఓ కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లా ఉంటుంది. మా డైరెక్టర్ లియో జాన్ పాల్ నా మీద ఎంతో నమ్మకంతో అవకాశం ఇచ్చారు. నన్ను నమ్మి ఛాన్స్ ఇచ్చినా ఫాతిమా గారికి, విజయ్ గారికి థాంక్స్’ అని అన్నారు.
 
బ్రిగిడ మాట్లాడుతూ, . ప్రతీ సారి తెలుగు ఆడియెన్స్ నన్ను ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు. ఈ చిత్రంతోనూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. జూన్ 27న మా ‘మార్గన్’ రాబోతోంది. అందరూ చూడండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోని గారికి థాంక్స్’ అని అన్నారు.
 
రైటర్ భాష్య శ్రీ మాట్లాడుతూ .. ‘విజయ్ ఆంటోని గారితో నా ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 127 నిమిషాల నిడివితో రాబోతోన్న ఈ చిత్రం ప్రతీక్షణం ఎంగేజింగ్‌గా ఉంటుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. బ్రిగిడ, దీప్శిఖ, అజయ్ పాత్రలు అద్భుతంగా ఉంటాయి. నన్ను నమ్మి అవకాశం ఇస్తున్న విజయ్ ఆంటోని గారికి థాంక్స్. ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.
 
తారాగణం: విజయ్ ఆంటోని, అజయ్ ధీషన్, సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి మరియు అంతగారం నటరాజన్