3 రాజధానులు: ఇంటర్వెల్ మాత్రమే, శుభం కార్డు పడలేదు: మంత్రి పెద్దిరెడ్డి

సోమవారం, 22 నవంబరు 2021 (20:07 IST)
మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతిలోని రాయల చెరువు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టులో ప్రభుత్వ వాదనలు వినిపించడంలో లోపాలు వుండవచ్చని.. రైతుల పాదయాత్ర పెయిడ్ ఆర్టిస్టులతో జరుగుతోందన్నారు.

 
తెలుగుదేశం పార్టీ రెండున్నర సంవత్సరాలుగా ఆ పెయిడ్ ఆర్టిస్టులతో పాదయాత్ర చేయిస్తుందని.. ఇప్పుడు కేవలం సినిమాలో ఇంటర్వెల్ ఇచ్చారన్నారు. మూడు రాజధానులకు ఇంకా శుభం కార్డు పడలేదని.. తాను మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాననీ స్పష్టం చేశారు.

 
మూడు రాజధానులపై సీఎం త్వరలోనే మరో నిర్ణయం తీసుకుంటారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. చట్ట పరమైన లోపాలు ఎక్కడ ఉన్నాయని పెద్దిరెడ్డి చెప్పుకొచ్చారు.

అన్నీ చూడండి

ప్రజలు రమ్మంటున్నారు... రాజకీయాల్లోకి వస్తున్నా : రాఘవ లారెన్స్

Nag Ashwin: మహానటి తర్వాత ప్రేక్షకులు ఓన్ చేసుకున్న సినిమా సింగ్ గీతం: నాగ్ అశ్విన్

సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌కు భయపడి క్షమాపణ చెప్పి ఉండాల్సిందికాదు : అనంత్ శ్రీరామ్

ప్రజలు కుక్కలు అని ఎలా అంటాను? టీవీకె గురించి నేనలా అన్నాననీ: రాఘవ లారెన్స్

కాశీలో రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments