ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ - హైదరాబాద్ - కేరళ యూనివర్శిటీల్లో ప్రదర్శన

బుధవారం, 25 జనవరి 2023 (15:23 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు సిరీస్ డాక్యుమెంటరీలను బీబీసీ ప్రసారం చేసింది. అయితే, వీటిని భారత్‌లో ప్రసారం చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా పలు రకాలైన ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్, కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఈ డాక్యుమెంటరీలను ప్రదర్శించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కొన్ని అనుబంధ విభాగాలు ప్రదర్శించాయి. 
 
ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలోని సెంట్రల్ యూనివర్శిటీలో ప్రత్యేక స్క్రీన్లతో డాక్యుమెంటరీని ప్లే చేశారు. ఆ తర్వాత వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, కేరళలోని పలు ప్రాంతాల్లో ఈ డూక్యుమెంటరీని ప్రదర్శించారు.
 
గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్న సమయంలో జరిగిన గోద్రా అల్లర్లను ఇతివృత్తంగా చేసుకుని బీబీసీ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. దాన్ని బీబీసీ రెండు భాగాల సిరీస్‌గా ప్రసారం చేసింది. ఈ డాక్యుమెంటరీ ఆగ్రహావేశాలు రేకెత్తించింది. బీజేపీతో దాని అనుబంధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఎంపిక చేసిన ఫ్లాట్‌ఫారమ్‌లపై ఈ డాక్యుమెంటరీ ప్రదర్శించకుండా కేంద్రం నిషేధించింది. 
 
అదేసమయంలో ఈ డాక్యుమెంటరీపై స్పందించేందుకు అమెరికా, బ్రిటన్ వంటి అగ్రదేశాలు ముందుకురాలేదు. ప్రపంచంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఉన్న క్రేజ్‌ను తగ్గించడానికి బీబీసీ కుట్రపూరితంగా దీన్ని తయారు చేసిందని భారత మూలాలు ఉన్న ప్రవాసభారతీయులతో పాటు బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 

అన్నీ చూడండి

Kiran Abbavaram,: యు/ఎ సర్టిఫికేషన్ పొందిన కిరణ్ అబ్బవరం... చెన్నై లవ్ స్టోరీ

Ravi Teja : ఇరుముడి' డబ్బింగ్ ప్రారంభించిన రవితేజ- త్వరలోనే సెకండ్ సింగిల్

శాన్‌ఫ్రాన్సిస్కోలో M4M 2 మూవీ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు

Sitara: ఎప్పటికీ చిన్నారి తార.. సితార అంటూ మహేష్ బాబు ఆప్యాయంగా ముద్దుపెట్టారు.

Vijay Deverakonda: రౌడీ జనార్థన మూవీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

తర్వాతి కథనం
Show comments