Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖమ్మం గురుకుల పాఠశాలలో విషాదం.. గుండెపోటుతో విద్యార్థి మృతి.. ఆడుకుంటూ..?

Written By సెల్వి
Updated: బుధవారం, 9 సెప్టెంబరు 2026 (11:15 IST)
Boy
ఖమ్మం గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటు కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాయ్స్ గురుకుల పాఠశాలలో, 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 
 
అప్రమత్తమైన సిబ్బంది చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా ఆ బాలుడు మరణించాడు. సమాచారం ప్రకారం, గుండెపోటు కారణంగానే ఈ అకస్మాత్తు మరణం సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. 
 
అయితే, మరణానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన హరీష్, ప్రియాంకల కుమారుడే ఈ సాత్విక్. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
About Author
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... Read More

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments