సంబంధిత వార్తలు
- మధ్యాహ్నం భోజన పథకంలో పాము ... ఆరగించిన విద్యార్థుల అస్వస్థత
- ఈస్ట్ కోస్ ఎక్స్ప్రెస్లో తొక్కిసలాట : ఇద్దరు విద్యార్థులకు అస్వస్థత
- స్కిల్ కేసులో సీఐడీ తీరు అనుమానాస్పదంగా ఉంది : పురంధేశ్వరి
- చంద్రబాబు అరెస్టుకు నిరసగా పార్లమెంట్ గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ధర్నా
- ఏపీ ప్రభుత్వ పెద్దలు కళ్లున్న కబోదిలు : నారా బ్రాహ్మణి
తిరుపతి జిల్లాలో కలుషిత ఆహారం తిని 50 మందికి అస్వస్థత
తిరుపతి జిల్లాలో కలుషిత ఆహారంతో 50కిపైగా మంది అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం కేబీపురం మండలం ఆరె గ్రామంలోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాదాన్ని నిర్వాహకులు గ్రామస్థులకు పంపిణీ చేశారు.
ప్రసాదం తిన్న గ్రామస్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందిస్తున్నారు.
కొందరు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా 30 మందికిపైగా చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తర్వాతి కథనం
