సంబంధిత వార్తలు
- ఐశ్వర్యారాయ్తో కాపురం చేయలేను.. ఆమె హైక్లాస్... తేజ్ ప్రతాప్
- నాకు ఐశ్వర్యా రాయ్ వద్దు మొర్రో అన్నా చేశారు... విడాకులు కోరిన మాజీ సిఎం కుమారుడు...
- కడుపులో తన్నాడు.. అసభ్యంగా మాట్లాడారు.. దునియా విజయ్పై కేసు పెట్టిన కుమార్తె
- నిర్మాత దగ్గుబాటి సురేష్ మద్యం సేవించి కారు నడిపారా?
- కోతులపై కేసు పెట్టండి.. అవేం చేశాయో తెలుసా?
బావ చేతిలో మోసపోయానంటున్న తారా చౌదరి
తారా చౌదరి... హైటెక్ వ్యభిచార సూత్రధారిణిగా గుర్తింపుపొందింది. నటి కూడా. తెలుగు చిత్రపరిశ్రమతో పాటు తెలుగు రాజకీయాల్లో ఈమె సంచలనంగా మారింది. అనేక మంది ప్రముఖులకు అమ్మాయిలను సరఫరా చేసినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అలా కొంతకాలంగా ఇంటికే పరిమితమైన తారా చౌదరి.. ఇపుడు మళ్లీ వార్తల్లోకెక్కారు. బావ వరుసయ్యే ఓ వ్యక్తి తనను దారుణంగా మోసం చేశాడంటూ పోలీసు మెట్లెక్కింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో తారా చౌదరి (31) ఓ ఫిర్యాదు చేసింది. అందులో తనకు బావ వరుసయ్యే చావ రాజ్కుమార్ అనే వ్యక్తి మోసం చేశారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొంది. రాజ్కుమార్ సోదరి సుజాత కారణంగా అతనితో మంచి పరిచయం ఏర్పడినట్టు చెప్పుకొచ్చింది.
సోదరుడు రాజ్కుమార్ను పెళ్లి చేసుకోవాలని తనను సుజాత కోరిందనీ, కానీ తాను మాత్రం అతనికి వివాహమైంది కదా అని ప్రశ్నించగా, లేదు విడాకులు ఇవ్వబోతున్నాడు ఎలాంటి సమస్యా ఉండదని సుజాత నమ్మించిందని తారా చౌదరి తన ఫిర్యాదులో పేర్కొంది.
అయినప్పటికీ రాజ్కుమార్ను తాను ఇష్టపడలేదని చెప్పింది. ఆ తర్వాత తాను హైదరాబాద్ను వీడి విజయవాడకు వెళ్లగా, అక్కడకు కూడా రాజ్కుమార్ వచ్చి తనను పలు రకాలుగా వేధించాడని ఆరోపించింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని నిలదీయగా, అతను తప్పించుకుని తిరుగుతూ తనను వేధిస్తున్నాడని తారా చౌదరి తన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
