ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 24 జులై 2020 (19:27 IST)

గోవిందా..గోవిందా, అద్భుతం.. శేషాచలం కొండల్లో...

తిరుమల వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న ప్రాంతమంటేనే ఒక ప్రత్యేకత. ఏడుకొండపై ఉన్న స్వామివారిని దర్సించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు వచ్చి వెళుతుంటారు. అలాంటి ప్రాంతం ఇప్పుడు మరింత అందంగా.. అద్భుతంగా దర్సనమిస్తోంది.
 
గత వారంరోజుల నుంచి తిరుపతిలో వర్షం పడుతోంది. కాసేపు వర్షం పడినా శేషాచలం కొండలు మాత్రం పచ్చగా కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో అటవీ ప్రాంతంలోనే చెట్లన్నీ ఎండిపోయి కళావిహీనంగా మారిపోతే ప్రస్తుతం వర్షం కారణంగా ఎంతో అందంగా శేషాచలం కొండలు కనిపిస్తున్నాయి.
 
దాంతో పాటు తిరుమలలో పడిన వర్షానికి కొండల మధ్య నుంచి నీరు జాలువారి తిరుపతిలోని కపిలతీర్థంలోకి వస్తోంది. మాల్వాడి గుండం నుంచి కపిలేశ్వర ఆలయంలోకి వస్తున్న నీటిని భక్తులు, స్థానికులు ఆహ్లాదకరంగా తిలకిస్తున్నారు. మరోవైపు తిరుమల ఘాట్ రోడ్లలో మంచు దుప్పట్లు కనిపిస్తున్నాయి. 
 
మంచు కొండలను దట్టంగా కప్పడంతో పాటు చిరుజల్లులు పడుతుండడంతో ఘాట్ రోడ్లలో వెళ్ళే భక్తులు కొత్త లోకంలో విహరిస్తున్నారు. ఎంతో అద్భుతమైన దృశ్యాలు శేషాచలం కొండల్లో కనిపిస్తుండడంతో భక్తుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. పరిమిత సంఖ్యలో భక్తులు వస్తున్నా తిరుపతిలోని వాతావరణానికి మంత్రముగ్థులు అవుతున్నారు.