గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు

timesofindia award
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీ అగ్రభాగంలో నిలిచింది. దీంతో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ అవార్డును ప్రదానం చేసింది. పోర్టుల నిర్మాణంలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంలో ఎంపికైనందుకు ఈ అవార్డును ప్రదానం చేసింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈ అవార్డును అందుకున్నారు. 
 
రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పోర్టులను నిర్మిస్తున్న కారణంగానే ఈ అవార్డుకు ఏపీ ఎంపికైంది. పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన ఏపీలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ అవార్డుకు ఎంపిక చేసి ప్రదాన చేసింది. 
 
మంగళవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో దీన్ని అందజేశారు. ఏపీ ప్రభుత్వం తరపున రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి గుడివాడ అమర్నాథ్, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, మారిటైం డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌లు ఈ అవార్డును అందుకున్నారు.