1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. chittoor district, road accident

చిత్తూరు జిల్లాలో రోడ్డుప్రమాదం - ఇద్దరి మృతి

chittoor district
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కర్ణాటక రాష్ట్రంకు చెందిన ఐదు మంది కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి కారులో వస్తుండగా పలమనేరు వైపు వెళుతున్న ట్రాక్టర్‌ కాటప్పగారిపల్లె వద్ద ఢీకొంది. 
 
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వాసుప్రతికి తరలించి చికిత్స చేస్తున్నారు. కారు అతి వేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 
About Writer
ttdj
తర్వాతి కథనం
లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలి : చింతామోహన్