శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (08:28 IST)

నేడు అల్పపీడనంగా మారనున్న ఆవర్తన ద్రోణి

అండమాన్ వద్ద బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ద్రోణి స్థిరంగా ఉందని, ఇది గురువారం అల్పపీడనంగా మారే అవకాశం ఉందని గోపాల్ ‌పూర్‌ వాతావరణ అధ్యయన కేంద్రం (ఐఎండీ) అధికారి ఉమాశంకర్‌దాస్‌ తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఈ అల్పపీడనం ఈ నెల 22వ తేదీలోగా వాయుగుండంగాను, 23వ తేదీకి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయన్నారు. తూర్పు కేంద్ర బంగాళాఖాతం నుంచి ఈ విపత్తు పశ్చిమ కేంద్ర బంగాళాఖాతానికి చేరువవుతుందని, ఆ తర్వాత మళ్లీ దిశ మార్చుకుని తీరంవైపు వస్తుందని చెప్పారు. 
 
తుఫాను తీవ్రత, ఎక్కడ తీరాన్ని దాటుతుందన్నదానిపై ఇంకా స్పష్టత లేదని, 22న పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఈ నేపథ్యంలో సముద్ర ఉపరితలంలో 22వ తేదీ నుంచి గంటకు 45-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, కెరటాల ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందన్నారు. చేపల వేట నిషేధించినట్లు వెల్లడించారు.