1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (16:32 IST)

'గోవిందా' 'గోవిందా' అని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం..

Govinda
'గోవిందా' 'గోవిందా' అని కోటి సార్లు రాస్తే కుటుంబ సమేతంగా వీఐపీ దర్శనానికి అనుమతిస్తామని తిరుపతి తిరుమల దేవస్థానం ప్రకటించింది. కోటి సార్లు గోవిందా గోవింద అని రాసి టీటీడీకి పంపాలని, అలా రాస్తే కుటుంబ సభ్యులను వీఐపీ దర్శనానికి అనుమతిస్తామని తిరుపతి దేవస్థానం సమావేశంలో నిర్ణయించారు. ఇంకా 10,01,116 సార్లు గోవింద అని రాస్తే ఒక్కరికే వీఐపీ దర్శనానికి అనుమతిస్తామని తిరుపతి దేవస్థానం తెలిపింది.
 
యువతలో సనాతన ధర్మం పట్ల, విలువ పట్ల అవగాహన పెంచే కార్యక్రమాలు చేస్తున్నట్టు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి తెలిపారు. ఇందుకోసం భగవద్గీత సారాంశాన్ని 20 పేజీల పుస్తకం రూపంలో యువతకు అందజేస్తామన్నారు. 
 
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌ రెడ్డి ఖండించారు. సనాతన ధర్మం అంటే మతం కాదని, ఒక జీవన విధానమన్నారు.