సంబంధిత వార్తలు
- కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం
- ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక
- ఇరాన్- ఇజ్రాయెల్ వివాదం.. అమెరికా వల్లే తీవ్ర నష్టం.. బాస్మతి రైస్ ధరలు తగ్గుముఖం
- దేశంలో పెట్రోల్ కొరత ఏర్పడిందా? కేంద్ర పెట్రోలియం మంత్రి ఏమంటున్నారు?
- Priyanka Gandhi గాజాలో అలా జరుగుతుంటే.. మోదీ సర్కారు ఇలా ప్రవర్తిస్తే ఎలా? ప్రియాంక గాంధీ
విజయనగరంలో ఐసిస్ ఉగ్ర కేసు మూలాలు : ప్రధాన నిందితుడు అరెస్టు
ఏపీలోని విజయనగరం జిల్లాలో అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐసిస్ మూలాలు వెలుగు చూశాయి. విజయనగరం ఐసిస్ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ జరుపుతున్న విషయం తెల్సిందే. ఈ విచారణలో భాగంగా ప్రధాన నిందితుడిని అరెస్టు చేసింది. అరెస్టయిన నిందితుడు బీహార్ రాష్ట్రానికి చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ అని ఎన్.ఐ.ఏ పేర్కొంది. దేశం నుంచి తప్పించుకునే క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో ఆరిఫ్ను ఎన్.ఐ.ఏ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత నిందితుడుని విశాఖపట్టణంకు తీసుకొచ్చి ఎన్.ఐ.ఏ. ప్రత్యేక కోర్టులో హజరుపరుచనున్నారు.
కాగా, విజయనగరం ఐసిస్ ఉగ్ర కేసులో అరెస్టయిన సిరాజ్ ఉర్ రెహ్మాన్ సయ్యద్ సమీర్లతో ఆరిఫ్కు సంబంధాలు ఉన్నట్టు ఎన్.ఐ.ఏ దర్యాప్తులో తేలింది. సిరాజ్, సమీర్ల వద్ద ఐఈడీఎస్ తయారీకి అవసరమైన రసాయనాలు ఉన్నట్టు ఎన్.ఐ.ఏ గుర్తించింది. వీరు ఉగ్రదాడులకు వ్యూహం పన్నినట్టు ఎన్.ఐ.ఏకి ఆధారాలు లభించాయి. దేశ వ్యాప్తంగా జిహాదీ కార్యకలాపాల కోసం ఆర్ఫి అక్రమ ఆయుధాలను సరఫరా చేసినట్టు ఎన్.ఐ.ఏ అధికారులు గుర్తించారు.
