సంబంధిత వార్తలు
- ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)
- ఆంధ్రప్రదేశ్: సోషల్ మీడియాలో రాజకీయ యుద్ధాలు, జుగుప్సాకర పోస్టులు, ఈ పరిణామాలకు కారణమేంటి?
- తాతయ్యతో బాలిక.. వైకాపా గ్రామ సర్పంచ్ అత్యాచార యత్నం.. ఎక్కడ?
- అమ్మాయిని ముద్దైనా పెట్టుకోవాలి.. కడుపైనా చేయాలన్న పెద్ద మనిషిని అరెస్ట్ చేశారా? (video)
- అసెంబ్లీ మీద అలగడానికో.. మైక్ ఇస్తేనే పోతానని మారాం చేయడానికో కాదు గెలిపించింది.. వైఎస్ షర్మిల
వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి
వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. ఈ మేరకు జగన్ ఆదేశాలతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. జగన్ ఆదేశాలతో వైసీపీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ, బొడ్డేడ ప్రసాద్లను నియమించారు.
కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేత కాగా, బొడ్డేడ ప్రసాద్ అనకాపల్లి జిల్లాకు చెందినవారు. ఇటీవల ఒంగోలు నియోజకవర్గ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన నేపథ్యంలో... ఒంగోలు నియోజకవర్గానికి కూడా ఇన్చార్జిని నియమించారు. ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరు రవిని నియమిస్తూ జగన్ ఆదేశాలు ఇచ్చారు.
