సంబంధిత వార్తలు
- అలిగిన భార్యను బుజ్జగించేందుకు సెలవు కోరిన కానిస్టేబుల్ ... మంజూరు చేసిన ఏఎస్పీ
- బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'కి సెన్సార్ పూర్తి - యూఏ సర్టిఫికేట్ మంజూరు
- కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మనవడిని కర్రలతో కొట్టి చంపేశారు.. ఎక్కడ?
- ఏపీఎఫ్ఎస్ఎల్ మాజీ జాయింట్ డైరక్టర్ అనుమాన స్పద మృతి
- తెలంగాణాలో రూ.58 వేల వేతనంతో 1226 ఉద్యోగాలు
మూడో విడత జగనన్న చేదోడు నిధులు విడుదల
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడో విడత జగనన్న చేదోడు నిధులు జనవరి 11న విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 3.95 లక్షల మంది చిన్న,చిరు వ్యాపారులు తమ వ్యాపారాన్ని మెరుగుపరచుకోవడానికి ఒక్కొక్కరికి రూ. 10,000 వరకు వడ్డీ రహిత రుణాన్ని పొందుతారు.
గత ఏడాది లబ్ధిదారులు పొందిన రుణానికి ఆరు నెలల వడ్డీకి రూ. 15.17 కోట్లు కాకుండా కొత్త లబ్ధిదారులకు రూ. 395 కోట్ల వడ్డీ లేని రుణాన్ని సీఎం విడుదల చేస్తారు.
ఈ మూడో విడత జగనన్న చేదోడుతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 15.31 లక్షలకు చేరుకుంటుంది. వడ్డీలేని రుణం మొత్తం రూ. 2,406 కోట్ల మార్కుకు చేరుతుందని అధికారులు చెప్పారు. మొత్తం లబ్ధిదారులలో, కనీసం 8.74 లక్షల మంది మునుపటి మొత్తాన్ని తిరిగి చెల్లించిన తర్వాత రెండవసారి రుణాన్ని పొందారు.
తర్వాతి కథనం
