1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (14:34 IST)

తిరుమలకు వచ్చే వీఐపీలకు ఉపరాష్ట్రపతి సూచన... ఏంటది?

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓ సూచన చేశారు. శ్రీవారి దర్శనం కోసం వీఐపీలు యేడాదిలో ఒక్కసారి మాత్రమే తిరుమలకు రావాలని ఆయన సూచించారు.

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓ సూచన చేశారు. శ్రీవారి దర్శనం కోసం వీఐపీలు యేడాదిలో ఒక్కసారి మాత్రమే తిరుమలకు రావాలని ఆయన సూచించారు. 
 
ఆయన మంగళవారం ఉదయం వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దర్శనం ముగించుకున్న వెంకటేశ్వర స్వామి మీడియాతో మాట్లాడారు. ఒకసాధారణ పౌరుడిగానే స్వామిని దర్శించుకున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ.. వెంకన్న భక్తులు పెరుగుతున్నారని చెప్పిన వెంకయ్య.. వారందరికి దర్శనం అవకాశం సులభంగా కలగాలన్నారు.
 
వీఐపీలుగా చెలామణి అయ్యే నాయకులు పదే పదే తిరుమలకురావడం తగ్గించాలని కోరారు. స్వామి దర్శనానికి వీఐపీలు సంవత్సరానికి ఒకసారి వస్తే మిగతా భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం సులభంగా కలుగుతుందన్నారు. ఇదే అంశాన్ని పరిశీలించాలని టీటీడీ అధికారులకు చెప్పానన్నారు. మరొకరు ఇబ్బంది పడుతూ మనం సంతోషంగా ఉంటే అది ఏమాత్రం మంచిది కాదన్నారు. 
 
కాగా, ఉపరాష్ట్రపతిగా మహాద్వారం నుంచి దర్శనానికి వెళ్ళాల్సి ఉన్నా, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి స్వామి దర్శనానికి వెళ్లడం తనకు ఆనందాన్ని ఇస్తోందన్నారు. క్యూలైన్‍లోనే వెళ్లి దర్శనం చేసుకున్నట్టు చెప్పారు. వేంకటేశుడి ముందు అందరూ సమానులే, సామాన్యులే అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని కోరారు.