ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (11:23 IST)

మా కుటుంబం.. లం.. కుటుంబమా? మీ శ్రీమతిగారు దేవతా? ముద్రగడ పద్మనాభం

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఒక లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. ముఖ్యంగా, తనను, తన భార్యను, తన కుమారుడిని, తన కోడలిని చంద్రబాబు పుత్రుడు నారా లోకేష్ పోలీసులతో బూతులు తిట్టించిన వైనాన్ని ఏకరవు పెట్టారు. అంతేకాకుండా, కాపులకు చంద్రబాబు ఇచ్చిన హామీని కూడా ప్రస్తావించారు.
 
ప్రధానంగా చంద్రబాబుకు ముద్రగడ పద్మనాభం రాసిన లేఖలో "కాపు రిజర్వేషన్ కోసం తాను దీక్ష చేపట్టిన మొదటి రోజునే గౌరవ తమరి పుత్రరత్నం గారు మా ఆవరణంలో ఉన్న పోలీసు అధికారులకు తరచూ ఫోన్ చేసి ఆ లం.. కొడుకుని (నన్ను) బయటకి లాగారా? లేదా?, తలపులు బద్ధలుకొట్టి నా శ్రీమతిని లం.. లెగవే అని బూటు కాలితో తన్నించి ఈడ్చుకెళ్లింది, నా కోడలిని లం.. నిన్ను కొడితే దిక్కెవరే అని తిట్టించింది, నా కొడుకుని లాఠీలతో కొట్టుకుని తీసుకెళ్లింది తమకు గుర్తు లేదాండి? 
 
ఇపుడు తమరి నోటివెంట ముత్యాల్లాంటి వేదాలు వస్తున్నాయి. బాబుగారు మీ దృష్టిలో మా కుటుంబం లం.. కుటుంబమా?, మీరు, మీ శ్రీమతిగారు దేవతా? మీ ఆఫీసులు దేవాలయాలా? మరి మావేమిటి, మా కొంపులు ఏమిటి? అంటూ ప్రశ్నలపై ప్రశ్నల వర్షం సంధించారు. ఈ సుధీర్ఘ లేఖలో అనేక విషయాలను ముద్రగడ పద్మనాభం ప్రస్తావించారు.