1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 9 డిశెంబరు 2021 (10:33 IST)

దొంగ‌ల ముఠా ప్ర‌వేశించింది... త‌స్మాత్ జాగ్ర‌త్త‌! కృష్ణా పోలీస్ విజ్ఞప్తి

యావన్మంది ప్రజానీకానికి కృష్ణా జిల్లా పోలీసు వారు ఇలా బ‌హిరంగ విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రి వేళ ఇళ్లల్లోకి చొరబడి హత్యలు చేసి, దోపిడీలకు పాల్పడుతున్నముఠా రాష్ట్రంలోకి ప్రవేశించింద‌ని నందిగామ పోలీస్ స్టేషన్ సి.ఐ. కనకారావు తెలిపారు. కాబ‌ట్టి కృష్ణా జిల్లాలోని ప్రజలందరూ పగటి పూట, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాల‌ని బ‌హింరంగ హెచ్చ‌రిక‌లు చేశారు.
 
 
మీ నివాస ప్రాంతాలలో అపరిచిత వ్యక్తులు అనిపించినా, అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే మీ స్థానిక పోలీస్ స్టేషన్ నంబర్ కుగాని, డయల్ 100 కు లేదా దిశా ఎస్. ఓ.ఎస్. ద్వారా తెలియజేయాల‌ని కోరారు. అలాగే, యువకులు మీమీ ప్రాంతాలలో రాత్రి పూటలు గస్తీ నిర్వహించవలసిందిగా కోరారు. 
 
 
మరీ ముఖ్యంగా మీ ప్రాంతాలలో ఎవరైనా సుదూర ప్రాంతాల నుండి అద్దెకు వచ్చిన కొత్త వ్యక్తులు లేదా మీ గ్రామ శివారు ప్రాంతాలలో గుడారాలు, గుడిసెలు ఏర్పాటు చేసుకుని ఉంటున్న వారి గురించి వెంటనే పోలీసువారికి సమాచారం తెలియజేయాలి. అదే విధంగా మీరు మీ ఇంటికి తాళం వేసి వేరే ఊర్లకు వెళ్లితే, పోలీసువారికి సమాచారం ఇవ్వాలి. దీనితో పోలీసు వారు మీ ఇంటికి మరింత భద్రత పెంచే అవకాశం ఉంది.


గ్రామ శివారు ప్రాంతాలలో, వెంచర్లలో అపార్ట్మెంట్లలో నివసించే వారు రాత్రి పూటల ఎవరైనా తలుపులు తట్టినా, లేదా వివిధ రకాలైన పిల్లల ఏడుపుల శబ్దాలు చేసినా తలుపులు తీయకుండా, ఇంటి లోపల నుండే సదరు వ్యక్తుల వివరాలు తెలుసుకోవాలి. అనుమానాస్పదంగా అనిపించినా, లేదా కనిపించినా వెంటనే పోలీసు వారికి సమాచారం ఇవ్వాల‌ని నందిగామ పోలీసులు విజ్న‌ప్తి చేశారు. సి.ఐ. క‌న‌కారావు, త‌న ఫోన్ నంబ‌ర్ ఫోన్. 8332983808 కూడా ప్ర‌జ‌ల‌కు కాల్ చేయ‌డానికి ఇచ్చారు.