1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 2 డిశెంబరు 2021 (16:01 IST)

28 వేల కోట్ల టర్నోవర్ తో ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు

ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు ఆప్కాబ్ ఇపుడు అంచెలంచెలుగా ఎదుగుతోంది. ఇపుడు తాజా లెక్క‌ల ప్ర‌కారం 28 వేల కోట్ల టర్నోవర్ కు చేరింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లిలో అప్కాబ్ - ఏపీ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు రాష్ట్ర 18వ శాఖను రాష్ట్ర అగ్రికల్చర్, మార్కెటింగ్ కో ఆపరేటివ్ ప్రిన్సిపల్ సెక్రటరీ వై. మధుసూదనరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 
 
 
ఈ సంద‌ర్భంగా ఆప్కాబ్ పర్సన్ ఇంచార్జి మల్లెల ఝాన్సీ రాణి, ఎండీ ఆర్.ఎస్.రెడ్డి ప్రసంగించారు. ఆప్కాబ్ పర్సన్ ఇంచార్జి మల్లెల ఝాన్సీరాణి మాట్లాడుతూ, ప్రజలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తూ ఆప్కాబ్ దినదినాభివృద్ధి చెందుతున్నట్లు తెలిపారు. ముఖ్య అతిథి వై.మధుసూదనరెడ్డి మాట్లాడుతూ,  రాష్ట్రంలో 28 వేల కోట్ల టర్నోవర్ తో అన్ని వర్గాల ప్రజలకు, సహకార వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వివ‌రించారు. 
 
 
విద్యా, హౌసింగ్, కమర్షియల్ రుణాలు, చిరువ్యాపారులకు రుణాలు అందిస్తూ అండగా నిలుస్తున్నట్లు తెలిపారు. ఆప్కాబ్ ఇన్ని ర‌కాలుగా రుణాలు ఇస్తున్న‌ట్లు చాలా మందికి తెలియ‌ద‌ని, అందుకే ఇటీవ‌ల బ్యాంక్ సేవ‌ల‌పై ప్ర‌చారం చేప‌ట్టామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కళ్యాణి, అప్కాబ్ సీజీఎంలు, డీజీఎంలు, ఏజీఎంలు, బీఎంలు పాల్గొన్నారు.