శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: సోమవారం, 26 జులై 2021 (18:41 IST)

ఏపీలో మ‌రోసారి ఐఎఎస్‌ల బ‌దిలీలు, సెర్ప్ సీఇవోగా ఇంతియాజ్

ఏపీలో ప‌దే ప‌దే ఐ.ఎ.ఎస్. లు, ఐ.పి.ఎస్.ల బ‌దిలీలు జ‌రుగుతున్నాయి. క‌నీసం వారానికోసారి అన్న‌ట్లు విడ‌త‌ల వారీగా బ‌దిలీలు జ‌రుగుతుండ‌టంతో అధికారుల్లో టెన్ష‌న్ మొలైంది. తాజాగా జ‌రిగిన బ‌దిలీల్లో ఐఏఎస్ అధికారుల బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

స్వప్నిల్ దినకర్‌ను కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. అలాగే, చిత్తూరు జేసిగా రాజబాబును నియ‌మించారు. కృష్ణా క‌లెక్ట‌ర్‌గా సుదీర్ఘ‌కాలం ప‌నిచేసిన ఇంతియాజ్ అహ్మద్‌కు సెర్ప్ సీఈఓగా బదిలీ ఇచ్చారు. ఆయ‌న‌కు సీసీఎల్ఏ అప్పీల్ డైరెక్టర్ గాను ఆయనకు అదనపు బాధ్యతలు అప్ప‌గించారు.

గంధం చంద్రుడును మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. సుమిత్ కుమార్‌ను తిరిగి మళ్ళీ శ్రీకాకుళం జెసి గానే ప్ర‌భుత్వం నియమించింది. ఇక అంబెడ్కర్‌ను పశ్చిమగోదావరి జిల్లా జేసిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎల్ఏ అప్పీల్ డైరెక్టర్ గా  ఇంతియాజ్‌ను అదనపు బాధ్యతలు నుంచి రిలీవ్ చేశారు.