బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్

Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్‌ను రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జేయూకేటీ) మంగళవారం విడుదల చేసింది. ఈ నోటిఫికేష్ ప్రకారం మంగళవార మధ్యాహ్నం నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 
 
ఈ దరఖాస్తులు చేసుకునేందుకు గడువు తేదీని సెప్టెంబరు 19వ తేదీ వరకు ఇచ్చారు. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రత్యేక కేటగిరీలు మినహా నాలుగు క్యాంపస్ విద్యార్థుల ప్రొవిజనల్ జాబితా 29వ తేదీన విడుదలవుతుందని పేర్కొంది. 
 
ఆ తర్వాత అక్టోబరు 12 నుంచి 15వ తేదీ వరకు క్యాంపస్‌లలో సర్టిఫికేట్ల పరిశీలన, అదే నెల 17వ తేదీ నుంచి తరగతుల ప్రారంభమవుతాయని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.