శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 3 ఆగస్టు 2020 (22:22 IST)

సౌదీలో సంసారం, మోజు తీర్చుకుని ఇండియాకి రాగానే ఆమె ఎవరో తెలియదంటున్నాడు?

ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లీనగరం గ్రామానికి చెందిన ఆవులమంద శేఖర్ సౌదీలో ఉండేవాడు. అదే ప్రాంతం సమీపంలోని చెన్నూరుకు చెందిన నాగమణి కూడా సౌదీలో పనిచేస్తూ ఉండేది. ఒక ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా అని పెళ్ళికి ముందే ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. 
 
ఆ తర్వాత కొద్దిరోజుల్లో నాగమణి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఏదో తూతూమంత్రంగా పెళ్ళి చేసుకున్నాడు శేఖర్. ఇద్దరూ కలిసి కాపురం పెట్టారు. వారికి ఐదేళ్ళ కుమార్తె కూడా ఉంది. అయితే లాక్‌డౌన్ కావడంతో స్వస్థలాలకు చేరుకునే క్రమంలో ఇద్దరూ ఇండియాకు వచ్చేశారు.
 
ఇక్కడకు వచ్చిన వెంటనే ప్లేటు ఫిరాయించాడు శేఖర్. నాగమణి ఎవరో తనకు తెలియదంటూ బుకాయించాడు. పెళ్ళి చేసుకుని ఇప్పుడు తానెవరో తెలియదని చెప్పడంతో నాగమణి కుంగిపోయింది. పెద్దలతో పంచాయతీ పెట్టించింది. అసలు ఐదేళ్ళ కుమార్తె తన బిడ్డే కాదంటున్నాడు శేఖర్.
 
దీంతో పంచాయతీ పెద్దలు ఎలాగోలా సర్దిచెప్పారు. కానీ తనకు 5 లక్షల కట్నం కావాలంటూ ఇప్పుడు రివర్స్ అయ్యాడు శేఖర్. తన దగ్గర అంత డబ్బు లేదని పంచాయతీ పెద్దల ముందే నాగమణి చెప్పడంతో శేఖర్ పంచాయతీ ముగియక ముందే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన బిడ్డతో పాటు భర్త ఇంటి దగ్గరకు వెళితే తాళాలు వేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. దీంతో న్యాయం కావాలంటూ బాధితురాలు భర్త ఇంటి ముందు మౌనపోరాటానికి దిగింది.