1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (14:57 IST)

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం : శుభాకాంక్షలు తెలిపి సోము వీర్రాజు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ ఆవిర్భవించి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని తొమ్మిదో యేటలోకి అడుగుపెడుతుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం గుంటూరు జిల్లాలో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. 
 
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆవిర్భవించి, రాష్ట్ర రాజకీయాల్లో నిర్మాణాత్మక శక్తిగా అవతరించిన పార్టీ జనసేన అని ఆయన గుర్తుచేశారు. బీజేపీ మిత్రపక్షమైన జనసేన ఆవిర్భావ దినోత్సవం వైభవోపేతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. 
 
కాగా, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఇప్పంట గ్రామంలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ వేడుకలు ప్రారంభమ్యయాయి. ఈ ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. దీంతో అమరావతి ప్రాంతమంతా జనసైనికులతో నిండిపోయింది.