గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 29 ఏప్రియల్ 2021 (22:29 IST)

నన్ను చంపి నా సరే.. ప్రశ్నిస్తూనే ఉంటా.. దేవినేని ఉమ

టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు గురువారం మంగళగిరి సీఐడీ కార్యాలయానికి హాజరయ్యారు. సీఐడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రికి దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడ గుంటూరు ప్రభుత్వ హాస్పిటళ్లను సందర్శించాలి. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదు. 
 
కరోనాతో ప్రజల ప్రాణాలు పోతుంటే.. జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు, సినిమాలు చూస్తున్నాడు. 22 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నామీద తప్పుడు కేసులు పెట్టి.. నా గొంతు నొక్కలేరు. 
 
హైకోర్టు ఆదేశాల్ని గౌరవిస్తూ విచారణకు హాజరయ్యాను. వ్యాక్సినేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉంది. వ్యాక్సిన్ వేయించలేని పరిస్థితి ఉంది. నన్ను రాజమండ్రి జైలులో పెట్టినా.. చంపినా.. ప్రశ్నిస్తూనే ఉంటాను. పోరాడుతూనే ఉంటాను’’ అని దేవినేని ఉమ పేర్కొన్నారు.