1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2020 (16:58 IST)

బ్రిటన్‌లో తెలుగు టెక్కీ మృతి - సర్కారు సాయం కోసం

ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించివున్న కష్టసమయంలో కర్నూలు జిల్లాకు చెందిన ఓ టెక్కీ విదేశీ గడ్డపై ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని స్వదేశానికి తీసుకునిరావాలంటూ మృతుని తల్లీ బోరున విలపిస్తోంది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమె కన్నీటితో విజ్ఞప్తి చేస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కర్నూలు జిల్లాకు చెందిన రఘోత్తమ్ అనే వ్యక్తి బ్రిటన్‌లోని హెచ్.సి.ఎల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య, కుమార్తెలు ఉన్నారు. అయితే, ఈయన తాజాగా చనిపోయారు. ఈ విషయం కర్నూలులో ఉన్న తల్లికి చేరింది. 
 
ఈ వార్త వినగానే ఆమె కుప్పకూలిపోయింది. ఆ తర్వాత తేరుకుని తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, కోడలు, మనుమరాళ్ళ భద్రతపై కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.